వికారాబాద్ జిల్లా తాండూరులో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్ వార్డెన్కు విద్యార్థులు తల్లిదండ్రులు దేహశుద్ది చేశారు. స్కూల్ వార్డెన్ మైనర్ బాలురను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే విద్యార్థులు భయపడి ఈ విషయాన్ని చెప్పడానికి ముందుకురాలేదు. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువకావడంతో ఏం చేయాలో తోచక తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థులు. దీంతో పేరెంట్స్ వార్డెన్ దశరథ్ను చితకబాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.