YS Sharmila: 12వ రోజు కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర

YS Sharmila: ఇబ్రహీంపట్నం యాచారం(మం) మొండిగౌరెల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం

Update: 2021-10-31 08:26 GMT

12 వ రోజు వైస్ షర్మిల పాదయాత్ర (ఫోటో ది హన్స్ ఇండియా)

YS Sharmila: వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 12వ రోజు కొనసాగుతోంది. ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం మొండిగౌరెల్లి నుంచి నుంచి ప్రారంభమైంది. అనంతరం నల్లవెల్లి తండా క్రాస్‌ వద్దకు పాదయాత్ర చేరుకుంది. ఆతర్వాత చింతపట్ల గ్రామంలో ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్‌టౌన్‌ ఎంట్రన్స్‌ వద్దకు షర్మిల పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 4గంటల 15 నిమిషాలకు మాల్‌టౌన్‌ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు ఇవాళ్టి పాదయాత్ర ఇవాళ్టి ముగుస్తుంది.

Tags:    

Similar News