జగిత్యాల జిల్లాలో మరోసారి కరోనా కలకలం.. గాంధీ ఆసుపత్రికి తరలింపు

Update: 2020-03-14 13:57 GMT

జగిత్యాల జిల్లాలో మరోసారి కరోన కలకలం రేపింది. బుగ్గారం మండలం గోపులాపురానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణలా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా మంచిర్యాలలో కరోనా వైరస్‌ కేసు బయటపడింది. ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన యువకుడిని పరీక్షించిన వైద్యలు కరోనా లక్షణాలు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News