NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన NIA సోదాలు

NIA Raids: ప్రజా సంఘాల నేతల ఇళ్లలో సోదాలు జరిపిన NIA

Update: 2023-10-02 13:05 GMT

NIA Rides: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన NIA సోదాలు

NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో NIA సోదాలు ముగిశాయి. 62 ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహించింది. తిరుపతిలోని న్యాయవాది క్రాంతి చైతన్య నివాసంలో NIA సోదాలు ముగిశాయి. ముంచుంగిపట్టు కేసులో సోదాలు జరిపినట్లు న్యాయవాది క్రాంతి చైతన్య తెలిపారు. ఈ కేసులో పోలీసులు 85 మందిని ముద్దాయిలుగా చేర్చారన్నారు. హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయడంతో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులను అరెస్ట్‌ చేయొద్దని కోర్టు తెలిపిందని అడ్వకేట్‌ క్రాంతి చైతన్య తెలిపారు. మమ్మల్ని బెదిరించేందుకు NIA దాడులు చేసిందని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News