Telangana: నిఘా నీడలో నూతన సంవత్సర వేడుకలు
పాత సంవత్సరానికి బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది.
పాత సంవత్సరానికి బై చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక ఈ వేడుకల యువతలు ఎంతో ఎంజాయ్ మెంట్ తో జరుపుకుంటారు. డిసెంబర్ 31 రాత్రి ఎక్కడ చూసినా ఒకటే సందడి, ఒకే కోలాహలం ఉంటుంది. ఇక ఈ వేడుకలపై గ్రేటర్లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు గట్టిగానే దృష్టి పెట్టబోతున్నారు. నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆ రోజు ఒక్క ప్రమాదం కూడా జరగకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. ఇక న్యూయర్ సందర్భంగా యువత ఫుల్ గా మత్తులో తేలి వాహనంపై దూసుకెళదామనుకుంటారు. దీనికి పోలీస్ శాఖవారు ముందుగానే బ్రేకులు వేయనున్నారు. మద్యం తాగి రోడ్డుపైన వాహనాలు నడిపితే చాలు వారిని పట్టకునే ప్రయత్నం చేయనున్నారు. మెయిన్ రోడ్లపై డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను విస్తృతం చేయనున్నారు. ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎవరైనా డ్రంకన్ డ్రైవ్ లో దొరికితే వారికి ఏకంగా రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష వేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
అంతే కాదు మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేయనున్నట్టు సైబరాబాద్, రాచకొండ పోలీసుకమిషనర్లు వీసీ సజ్జనార్, మహేష్ భగవత్ ప్రజలకు హెచ్చరించారు. దాంతో పాటు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు హోటల్స్, ఈవెంట్ నిర్వాహకులకు న్యూయన్ నిబంధనలను గురించి ఇప్పటికే పోలీసులు దిశానిర్దేశం చేశారు.
మార్గదర్శకాలు
♦ న్యూ ఇయర్ వేడుకలను డిసెంబర్ 31న రాత్రి 8 నుంచి ఒంటి గంట వరకు మాత్రమే జరుపుకోవడానికి అనుమతి.
♦ సౌండ్ పోల్యూషన్ కు కారణమయ్యే డీజేలకు అనుమతి లేదు.
♦ ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాల్సిందే.
♦ ఈ రోజున డ్రగ్స్, హుక్కా వంటి వాటిని పూర్తిగా నిషిద్ధించాలని పోలీసులు తెలిపారు.
♦ రేవ్ పార్టీలకు అనుమతి లేదు.
♦ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను పార్టీ నిర్వహకులు నియమించుకోవాలి.
♦ పార్టీ జరిగే పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలి.
♦ వేడుకలకు నిర్వహించడానికి అనుమతి తీసుకున్న వారు కార్యక్రమాన్ని వీడియో రికార్డ్ చేసి పోలీసులకు రెండు రోజుల్లో సమర్పించాలి.
అంతే కాదు ఎవరైతే ఈ వెంట్లను నిర్వహిస్తారో వారే ఆ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా భద్రత చర్యలను తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాల(ఫైర్ ఎక్స్టింగుషర్లు)ను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వచ్చిన వారికి కావలసిన సౌకర్యాలను పార్టీల నిర్వాహకులు చూసుకోవాలని తెలిపారు. ఈవెంట్లో ఏమైనా గొడవలు జరిగినా ఎవరి ప్రాణాలైనా పోతే నిర్వాహకులనే విచారిస్తామని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
పార్టీల అనుమతి లెక్క ఇదీ..
నూతన సంవత్సర వేడుకలకు పోలీసులు కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అనుమతిని ఇచ్చారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 75 ఈవెంట్లు, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 33 ఈవెంట్లకు అనుమతిచ్చారు. ఇక హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో 124 ఈవెంట్లకు అనుమతిచ్చారు. ఇదిలా ఉంటే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదాపూర్ జోన్లోనే 63 ఈవెంట్లకు అనుమతినిచ్చారు.
మద్యం అమ్మకాల జోరు..
నయాసాల్ సంబరాల కోసం మద్యం ను ముందుగానే కొని పెట్టుకుంటున్నారు ప్రజలు. దీంతో మద్యం అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ మద్యే ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో గతేడాది కంటే ఈ ఏడారి ఆదాయం డబుల్ వస్తుందని అంచనా వేస్తున్నారు మద్యం అమ్మకం దారులు. గేతేడాది డిసెంబర్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.600 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు సాగడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
ఇక ఈ వేడుక సందర్భంగా ''ఔటర్ రింగ్ రోడ్డుపై డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు వాహనాలను అనుమతించరని పోలీసులు తెలిపారు. ఇక మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లలనుకునే వారు టికెట్ ను ఖచ్చితంగా చూపించాలని తెలిపారు. అలాగే, బేగంపేట ఫ్లైఓవర్ మినహాయించి మిగతా ఫ్లై ఓవర్లను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు.''
ఈవెంట్ల వద్ద డిస్ప్లే తప్పనిసరి
100 మి.లీ రక్తంలో ఆల్కహల్ పరిమితి 30 మైక్రోగ్రాములు మించొద్దు. డ్రంకన్ డ్రైవ్ చేయరాదు. ప్రతీ ఒక అంశాన్ని ఈవెంట్ నిర్వాహకులు స్క్రీన్పై ప్రదర్శించాలి. – వీసీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ
♦ డిజిగ్నేటెడ్ డ్రైవర్లను వాడుకోండి
♦ డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తాం. 'డిజిగ్నేటెడ్ డ్రైవర్' సేవలను వినియోగించుకుంటే ప్రమాదాలకు అవకాశం ఉండదు.
♦ డ్రంకన్ డ్రైవ్ తనిఖీల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయనున్నాం. పార్టీల నిర్వాహకులు క్యాబ్లు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలి. – మహేష్ భగవత్, రాచకొండ సీపీ.