ఈ ఎస్ ఐ స్కాంలో బయటపడుతున్న రోజుకో కొత్త కోణం

ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో రోజు రోజుకు ఓ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Update: 2019-10-11 07:11 GMT

 ఈఎస్ఐ మెడికల్ స్కామ్‌లో రోజు రోజుకు ఓ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్కాంలో తాజాగా ప్రైవేట్ ఆసుపత్రుల పాత్ర బయటపడింది. ఈఎస్ఐ సిబ్బంది ప్రైవేట్ ఆసుపత్రులతో కలిసి స్కాం చేసినట్లు ఏసీబీ విచారణలో గుర్తించారు. పటాన్‌చెరు, చర్లపల్లి, వనస్దలిపురం, ఆర్‌సీ.పురం డిస్పెన్సరీ మందుల విక్రయాల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్నారు. ఓమ్ని ఫార్మతోపాటు ఇద్దురు జాయింట్ డైరెక్టర్లు పద్మ, వసంత, ఫార్మసిస్ట్ రాజికలు ప్రైవేట్ ఆసుపత్రులకు మందులు తరలించారు. ఈఎస్ఐ మందులను దొడ్డిదారిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా ఏసీబీ గుర్తించింది.

మెడిసిన్స్ కొనుగోలు చేసి వాటిని డిస్పెన్సరీలకు పంపించి అక్కడి నుంచి కార్మికులకు ఇచ్చినట్లుగా చూపెట్టినట్లు విచారణలో వెల్లడయ్యింది. ప్రతి డిస్పెన్సరీ పరిధిలో నాలుగు పెద్ద ఆసుపత్రులకు ఈఎస్ఐ మందులు సరఫరా చేసినట్లుగా గుర్తించారు. అక్రమంగా ఈఎస్ఐ మందులు కొనుగోలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై కేసులు నమోదు చేయాలని ఏసీబీ భావిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల జాబితాను ఏసీబీ సిద్దం చేసింది.  

Tags:    

Similar News