నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పలువురు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్లపై కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ఐపీఎస్లు, నలుగురు ఐఏఎస్లపై కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను దుర్వినియోగం చేసి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన కేసులో వారిపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు రిపోర్ట్ తయారుచేసి కేంద్రానికి నివేదిక పంపిన కేసులో వత్సల అనే మహిళ నాంపల్లి కోర్టును ఆదేశించింది.
దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు వీరిపై ఐవీసీ 201, 203, 204, 213, 193, రెడ్ విత్ యాక్ట్ 34, 120బితో పాటు సీఆర్పీసీ 156(3) సెక్షన్ల కింద సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో మాజీ ఐపీఎస్ లు దినేశ్ రెడ్డి, కేఎల్ఎన్ రాజుతో పాటు మాజీ ఐఏఎస్ లు ఎస్వీ ప్రసాద్, పి.కె. మహంతి, రత్నప్రభ, విద్యాసాగర్ లు ఉన్నారు.