మాజీ మంత్రి ముత్యం రెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ సీనియర్, మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

Update: 2019-09-02 03:07 GMT


టీఆర్ఎస్ సీనియర్, మాజీమంత్రి చెరుకు ముత్యంరెడ్డి ఈరోజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ముత్యం రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఇద్దరు నేతలు కలిసి పనిచేశారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ముత్యంరెడ్డి చివరి సారిగా 2009 ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముత్యం రెడ్డి మృతిపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Tags:    

Similar News