బ్రేకింగ్ న్యూస్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎంపీ రేవంత్రెడ్డి అరెస్ట్
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎంపీ రేవంత్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేవంత్రెడ్డిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ఫాంహౌస్పై డ్రోన్ ఎగురవేసిన కేసులో అరెస్ట్ చేశారు.
డ్రోన్ ఎగురవేసిన కేసులో మొత్తం 8 మందిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్184,187, 11 రెడ్విత్ 5ఏ, ఎయిర్క్రాఫ్ట్ యాక్ట్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.