రాహుల్ కవిత ట్విటర్ వార్ పై స్పందించిన కోమటిరెడ్డి

మీ పార్టీ ఎంపీలు ఏనాడూ వరిధాన్యం కోసం మాట్లాడలేదు : కోమటిరెడ్డి

Update: 2022-03-29 10:45 GMT

రాహుల్ కవిత ట్విటర్ వార్ పై స్పందించిన కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy: వరికొనుగోళ్లపై రాహుల్ గాంధీ, ఎమ్మెల్సీ కవిత మధ్య జరిగిన ట్విట్టర్ వార్ పై ఎంపీ కోమటిరెడ్డి స్పదంచారు. వాస్తవాలు తెలుసుకోకుండా కవిత మాట్లాడుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ లో ఆపార్టీ ఎంపీలో ఎప్పుడు వరికొనుగోళ్లపై మాట్లాడలేదన్నారు. మంత్రులు ఢిల్లీ కొస్తేనే దిక్కులేదు ఇక గ్రామస్థాయి తీర్మాలేం పనిచేస్తాయన్నారు.

ఆపార్టీ నేతలుకు చిత్తశుద్ది ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని అందుకు తాము కూడా మద్దతిస్తామన్నారు. అవసరమైతే రైతుల కోసం తమ పదవులకు రాజీనామాలు చేస్తామని సవాలు విసిరారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు సంక్షేమ కోసమే పాటుపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటనే రైతు పక్షపాతి అన్నారు. రాజకీయ లబ్ది కోసం రైతులను ఇబ్బందిపెట్టొద్దన్నారు.

Tags:    

Similar News