ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ, పోడు భూముల్లో మొక్కలు నాటితే పీకేయ్యండని పిలుపునిచ్చారు. ఫారెస్టు అధికారులు వస్తే తరిమికొట్టండని... వారికి తన్నులు తప్పవని అన్నారు. ఆదిలాబాద్లో సీడెం శంభు ప్రథమ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఎంపీ ఈ వ్యాఖ్యలు చేశారు.