మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్దిపొందేందుకే నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ ఎంఐఎంతో కలిసి సభ పెట్టారని ధ్వజమెత్తారు ఎంపీ ధర్మపురి అరవింద్. మతప్రాతిపదికన నిర్వహించిన సభకు అనుమతి ఎలా ఇచ్చారంటూ పోలీసులను ప్రశ్నించారు. నిజామాబాద్లో ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. మైనారిటీ ఏరియాలో తన పర్యటన వద్దని పోలీసులు చెబుతున్నారని.. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు.
ఎంపీకే రక్షణ ఇవ్వలేకపోతే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ హిందువులకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని సీఎంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్నారు. అసదుద్దిన్ ఒవైసీ పొలిటికల్ బ్రోకర్ అంటూ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఏ బిల్లును వెనక్కి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఎన్.పి.ఆర్ అమలు చేసి తీరుతుందని చెప్పారు. అభివృద్ధిని చూసి మైనారిటీలు ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్,ఎంఐఎం లకు ప్రజలు బుద్ధి చెబుతారని అరవింద్ పేర్కొన్నారు.