మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి తన మాటలపై యుటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసమే తానావ్యాఖ్యలు చేశానని, అధిష్టానం తనపై చర్యలు తీసుకోదని అన్నారు. కేసీఆర్తో యుద్ధం చేయాలంటే కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి సరిపోరని అన్న మాటలకు.. షోకాజ్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. దానికి తాను సమాధానం చెప్పానని, తనపై చర్యలు తీసుంటారని అనుకోవట్లేదని వింవరించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయాక.. నాయకత్వంలో మార్పులు చేస్తే బాగుండేదని అన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు అందరికి సముచితంగా ఉండే నిర్ణయం తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి.