Moranchapalli: ఇంటింటికీ తిరిగి.. క్షేమసమాచారం తెలుసుకుని.. మోరంచపల్లిలో బాధితులను పరామర్శించిన గండ్ర దంపతులు

Moranchapalli: సహాయక చర్యలను వారం రోజుల్లో పూర్తి చేస్తామంటున్న గండ్ర దంపతులు.

Update: 2023-07-29 04:21 GMT

Moranchapalli: ఇంటింటికీ తిరిగి.. క్షేమసమాచారం తెలుసుకుని.. మోరంచపల్లిలో బాధితులను పరామర్శించిన గండ్ర దంపతులు

Moranchapalli: మోరంచపల్లిలో గ్రామస్తులకు కన్నీరే మిగిలింది. భూపాలపల్లి నియోజకవర్గంలో ఇంత పెద్ద విపత్తు రావడంతో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జడ్పీ ఛైర్‌పర్సన్ గండ్రజ్యోతిలు స్థానికులకు భరోసా కల్పించేందుకు రెండు రోజులు ఇక్కడే ఉన్నారు. నష్టం చాలా జరిగిందని, వాగుకు పైన చెరువు తెగిపోయి వరద రావడంతో ఊరే మునిగిందన్నారు. అంతే కాకుండా అధిక వర్షపాతం కారణం కూడా ఈ వరదకు కారణమని గండ్ర చెప్పారు. గ్రామస్తులకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలను వారం రోజుల్లో పూర్తి చేస్తామంటున్న గండ్ర దంపతులు.

Tags:    

Similar News