మారుతున్న కాలానుగుణంగా ఏ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు. ప్రమాదవాశాత్తు ఏదైనా విపత్తు ఏర్పడితే దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కునే పద్ధతిలో వాహణాలను రూపొందించి ప్రవేశపెట్టింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ వాహనాలను డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ వాహనాలు అని పిలుస్తారు. ఈ వాహనాలను ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ పార్కింగ్ యార్డులో ప్రారంభించారు. ఈ వాహనాలలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగి ఉంటాయని వారు తెలిపారు. వాటిలో ముఖ్యంగా జనరేటర్, ఆక్సిజన్ సిలిండర్లు, 500 మీటర్ల వరకు వెలుతురు వచ్చే ఆస్కా లైట్ ఉన్నాయి. వాహనాల పనితీరును, పరికరాల ఉపయోగాన్ని మంత్రి కేటీఆర్కు అక్కడున్న అధికారులు వివరించారు. సమాచారం వచ్చిన వెంటనే ఈ వాహనాలు ప్రమాద స్థలానికి చేరుకుని రెస్య్కూ పనులకు నిర్వహిస్తుందని వారు తెలిపారు.