కానిస్టేబుల్‌ యశోదకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

Update: 2020-03-31 03:47 GMT

కరోనా బాధితులను ఆదుకొనేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సైదాబాద్‌ పీఎస్‌ కానిస్టేబుల్‌ బి.యశోద తన వంతు సాయంగా 100 కిలోల బియ్యం అందజేశారు. మానవత్వంతో స్పందించిన సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ యశోదను మంత్రి కేటీఆర్‌ అభినందించారు. ఆపన్నులను ఆదుకోవడానికి 100 కిలోల బియ్యం విరాళంగా ఇవ్వడం అభినందనీయమని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇలాంటి క్లిష్టసమయంలో ఉచిత ఆహార సరఫరాకు సహాయంగా ఉండేలా ఉడతా భక్తిగా బియ్యం అందజేసి ఉదారతను చాటుకొన్నారంటూ కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Tags:    

Similar News