కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మాటలను తప్పుబట్టారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విపక్షాలు తుమ్మిడిహట్టి పేరుతో రాజకీయాలు చేస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.