కడెం ప్రాజెక్టుకు వరద పోటు ... అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

Indrakaran Reddy: దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

Update: 2022-07-13 05:08 GMT

కడెం ప్రాజెక్టుకు వరద పోటు ... అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష 

Indrakaran Reddy: కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశమైన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరద పరిస్థితిపై ఆరా తీశారు. ముంపు గ్రామాలు, సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

Tags:    

Similar News