వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓపీలో సీనియర్ డాకర్టు లేకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీ డాక్టర్లు ఉండటంతో సూపరింటెండెంట్పై మండిపడ్డారు. గైర్హాజరైన సీనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వారు ప్రైవేటు క్లినక్లు నడిపిస్తే వెంటనే మూసివేయాలని చెప్పారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్తో కలిసి ఎంజీఎం మొత్తం మంత్రి ఎర్రబెల్లి తనికీ చేశారు.