కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని తెలంగాణ సీఎం కేసీఆర్ సరిగ్గా 11: 25 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని కేసీఆర్ ప్రారంభించించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కన్నెపల్లి పంపుహౌస్లో ఆరో నంబరు మోటార్ను కేసీఆర్ స్విచ్ఛాన్ చేసి ప్రారంభించనున్నారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. మేడిగడ్డ వద్ద నిర్వహించిన హోమంలో గవర్నర్ నరసింహన్, సీఎంలు జగన్, దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.