వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ

Update: 2020-12-28 07:54 GMT

భక్తుల రద్దీ......

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైనా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో సోమవరం సందర్బంగా భక్తుల రద్దీ తో సందడి గా మారింది.ఈ రోజు సోమవారం కావడం తో ఈ క్షేత్రంకు భక్తులు అధిక శాతం తరలి వచ్చి 3 గంటల పాటు క్యూలైన్ లో ఉండి దర్శనం చేసుకున్నారు.ఆలయ ప్రాంతమంత భక్తుల తో నిండిపోయింది. శివునికి ప్రీతిపాత్ర మాసమైన ఈ కార్తీక మాసం లో శివపార్వతులను దర్శించుకొని అనుగ్రహం పొందుతే పాపాలు మాటుమాయం అవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.ఆలయం అంత శివనమస్మరనతో మారుమోగింది, ఉదయం నుండే స్వామి వారి దర్శనం కోసం 3 గంటలు క్యూలైన్ లో నిలబడి  స్వామి వారిని  దర్శించుకున్నారు. అయితే గర్భగుడి దర్శనం, అభిషేకలకు మాత్రం అలయ అధికారులు అనుమతి ఇవ్వలేదు.



Tags:    

Similar News