సిద్దిపేట జిల్లాలో దారుణం
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూసల శ్రీకాంత్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు.
సిద్దిపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పూసల శ్రీకాంత్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలతో పొడిచి హత్య చేశారు. అయితే బోనాల శ్రీనివాస్ అనే వ్యక్తి... తానే హత్యకు పాల్పడ్డానంటూ పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడు శ్రీకాంత్ ఇసుక వ్యాపారం చేస్తుంటాడు.
ఈ క్రమంలో కమీషన్ల కోసం.. తాగిన మైకంలో శ్రీకాంత్ను బీరుసీసాలతో పొడిచి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. హుస్నాబాద్ మండల కేంద్రంలోని ఎల్లమ్మచెరువుకట్టపై ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.