కలెక్టరేట్ లో వ్యక్తి హాల్చల్ .. చెట్టు ఎక్కి హంగామా

Update: 2019-11-11 09:48 GMT

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఓ వ్యక్తి హాల్చల్ చేశాడు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని చెట్టు ఎక్కి హంగామా చేశాడు. చెట్టుపై ఎక్కిన వ్యక్తిని దించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామానికి చెందిన రైతు గంగారం రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేసేందుకు ప్రజావాణికి వచ్చాడు.

పక్క పొలం వ్యక్తి ఎక్కువ లోతులో బోరు వేయడం వల్ల తన బోరులో నీళ్లు రావడంలేదని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల తీరుకు నిరసనగా చెట్టు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. పోలీసులు సర్ది చెప్పి చెట్టుపై నుంచి కిందకు దించారు. ఈ ఘటన ఒక్కసారిగా కలకలం సృష్టించింది. 

Tags:    

Similar News