మెట్రో పిల్లర్ కారణంగా దుర్మరణం పాలైన మౌనిక కుటుంబ సభ్యులతో ఎల్అండ్ టీ అధికారుల చర్చలు సఫలం అయ్యాయి. రూ. 20 లక్షలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఎల్అండ్ టీ అధికారులు హామీ ఇచ్చారు. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.