తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను ఏప్రిల్ 15 వరకు కొనసాగించనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. కేంద్రం గతంలో ప్రకటించినట్లుగానే, తాముకూడా అప్పటి వరకు కొనసాగిస్తామని సీఎం అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని కేసీఆర్ చెప్పారు.
20 వేల మంది క్వారంటైన్లో ఉన్నారని, ఇవాళ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీతో ఈ రోజు మాట్లాడినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారన్నారు.