పశువులతో పాటు కాపరి వరద నీటిలో చిక్కుకుని విలవిల్లాడిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. నేరేడిగొండ మండలం వెంకటాపూర్ గ్రామంలో కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ ప్రభావంతో రెండు ఆవులు, పశువుల కాపరి శివరాంను నీటిలో చిక్కుకుపోయారు. పోలీసులు రంగంలోకి దిగి తాడు సహాయంతో శివరాంను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు.