తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం ఇవాళ్టితో ముగుస్తున్నది. పాలకవర్గాలకు వీడ్కోలు సమావేశం అనంతరం వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు స్వీకరించనున్నారు. మున్సిపాలిటీలకు ఆర్డీవో, సబ్ కలెక్టర్లు, మేజర్ మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు కలెక్టర్లు, ఐఏఎస్లు ప్రత్యేకాధికారులుగా నియమితులుకానున్నారు. గతంలో ఉన్న 73 మున్సిపాలిటీల్లో ఐదు మినహా.. మిగిలినవాటిలో ప్రత్యేకాధికారులు రానున్నారు. నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఇప్పటికే అధికారులు బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. వారినే ప్రత్యేకాధికారులుగా నియమిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ఒకేసారి ప్రత్యేకాధికారులు ఉండాల్సి రావడంతో.. కొత్తవాటిల్లో పాత అధికారులే బాధ్యతలు స్వీకరిస్తారు.