రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆకస్మికంగా పర్యటించారు. ముందస్తు సమాచారం లేకుండా కేటీఆర్ రావడంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. బైపాస్ రోడ్డులో ఉన్న కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల గ్రామ ప్రణాళిక కార్యక్రమంపై జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని వారి వద్ద నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వికలాంగులకు చేయూతగా ద్విచక్ర వాహనాలను అందించారు.