రంగారెడ్డి, హైదరాబాద్ గులాబీ నేతలతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదు, మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్లో సభ్యత్వ నమోదుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్ సెప్టెంబర్ 6 నాటికి మెంబర్ షిప్ డ్రైవ్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక మున్సిపల్ ఎన్నికల సమన్వయం కోసం త్వరలోనే ఇన్ఛార్జులను ప్రకటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. అయితే మూడ్రోజుల్లో బస్తీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించిన కేటీఆర్ ప్రతి బూత్కి ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉండాలన్నారు.