ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేటీఆర్

Update: 2019-01-04 02:51 GMT

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన మాజీ మంత్రి కేటీఆర్ మరింత దూకుడు పెంచారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏకంగా తొలి ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ పేరును కేటీఆర్ అనౌన్స్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ప్రస్తుతం కరీంనగర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వినోద్ మరోసారి పోటీచేయనున్నారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున బరిలోకి దిగిన వినోద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై విజయం సాధించారు. కాగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

Similar News