సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమం: కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Update: 2020-02-24 10:53 GMT
KTR File Photo

సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక పట్టణ ప్రగతి కార్యక్రమం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. వార్డుల వారీగా శానిటేషన్‌ ప్రణాళిక రూపొందించాలి అని అధికారులకు సూచించారు. మన నగరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కేటీఆర్ ప్రారంభించారు. తడి, పొడి చెత్తను వేరు చేసేలా ప్రజలను చైతన్యపరచాలి అని కేటీఆర్ కోరారు.

మున్సిపాలిటీలో 10 శాతం నిధులు పచ్చదనం పెంపునకు ఖర్చు చేయాలి అని కేటీఆర్ సూచించారు. పట్టణాల్లో పారిశుద్ద్యం, పచ్చదనం పెరగాలన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలి.. లేకపోతే పదవి పోతుంది అని కౌన్సిలర్లకు హెచ్చరించారు. 75 గజాల లోపల ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అనుమతి అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టంచేశారు.


Full View


Tags:    

Similar News