ట్రంప్ కలలోకి రావడంతో పూజలు చేస్తున్నా కృష్ణ.. ఇండియాకు వచ్చినప్పుడు కలుస్తానంటూ ట్రంప్ ట్వీట్
అభిమానం సప్త సముద్రాలు దాటింది. అగ్రరాజ్యాధిపతి మనస్సును గెలుచుకుంది. ఓ యువకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను తన ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాడు. ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేసి గత ఐదేళ్ల నుంచి కుంకు మార్చనలు చేస్తూ అమెరికా అధ్యక్షుడి మనసును గెలుచుకున్నాడు. త్వరలోనే అభిమానిని కలుస్తానని ట్రంప్ ట్వీట్ చేశారు.
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్స కృష్ణ గత ఐదేళ్ల నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపుపై అభిమానంతో పూజలు చేస్తున్నాడు. ఓ రోజు అర్ధరాత్రి ట్రంప్ కలలోకి వచ్చాడని అప్పటి నుంచి ట్రంప్ ఫొటోకు నిత్యం పూజలు చేస్తున్నానని చెబుతున్నాడు. ట్రంప్ ఫోటోకు నిత్యం జలాభిషేకం, పుష్పాభిషేకం చేస్తూ ట్రంప్ను ఆరాధిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో క్రిష్ ఇండియాకి వచ్చినప్పుడు నిన్ను కలుస్తానని ట్రంప్ ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. దీంతో అభిమానం తట్టుకోలేక ఇంటి ముందే డోనాల్డ్ ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి రోజు పూజలు చేస్తున్నాడు. భారత్- అమెరికా దేశాల నడుమ సంబంధాలు మెరుగుపడాలని అభిమాని కృష్ణ ఆకాంక్షిస్తున్నాడు.