మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ తన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీ.పీసీసీ తమకు వచ్చే అవకాశం లేదని, బీజేపీలో మంచి అవకాశాలు వస్తాయని అనుచరులతో రాజగోపాల్రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న రాజగోపాల్రెడ్డి.. ఇవాళ హైదరాబాద్ పెద్ద అంబర్పేట్లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బీజేపీలో చేరే విషయాన్ని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.