ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్, బీజేపీవి నాటకాలు -రాహుల్ గాంధీ

Rahul Gandhi Vs Kavitha: ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ ట్వీట్ కు కవిత కౌంటర్

Update: 2022-03-29 08:45 GMT

ధాన్యం కొనుగోళ్లపై రాహుల్ ట్వీట్ కు కవిత కౌంటర్

Rahul Gandhi Vs Kavitha: తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. టీఆర్ఎస్, బీజేపీవి నాటకాలంటూ తెలుగులో ట్వీట్ చేశారు ఆ‍యన. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నైతిక బాధ‌్యతను విస్మరించాయని. అన్నం పెట్టే రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలన్నారు.

అటు రాహుల్ గాంధీ ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా సంఘీభావం తెలపడం కాదు, తెలంగాణ రైతులపై అభిమానం ఉంటే పార్లమెంట్ లో నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్‌ ఎంపీలకు మద్దుతు తెలపాలంటూ రీ ట్వీట్ చేశారు కవిత. ఇక ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం కూడా అన్ని రాష్ట్రాల పట్ల ఒకేలా వ్యవహరించాలంది.




Tags:    

Similar News