తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. వెటర్నరీ డాక్టర్ సహా రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకోని పరిస్థితిలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఉందని అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.