మాజీ మంత్రి జోగు రామన్న అజ్ఞాతం వీడారు. రాజధాని హైదరాబాద్లో ఉన్న తన కుటుంబ సభ్యులను కలిశారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్నట్టు జోగు సన్నిహితులు తెలియజేశారు. మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో అలక చెందినట్టు వస్తున్న వార్తలు అవాస్తవమంటూ జోగు రామన్న తెలియజేశారు. మంత్రి పదవి వచ్చిన రాకున్నా టీఆర్ఎస్తోనే ఉంటానని తెలియజేశారు. ఈ విషయంలో కార్యకర్తలు ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఆయన సూచించారు.