జనసేన పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగంపై జనసేన పార్టీ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా 2వేల కోట్ల రూపాయలు బ్లాక్ మనీని వైట్ చేశారంటూ వైసీపీ సోషల్ మీడియా పేజీలో అసత్య ప్రచారం చేస్తున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్పై అసత్య ప్రచారం చేస్తున్న వైసీపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.