జగన్ కి అరుదైన గౌరవం ...

Update: 2019-06-19 14:19 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి తెలంగాణాలో అరుదైన గౌరవం లభించింది.. తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకంపై వైఎస్ జగన్ పేరును లిఖించారు. ముందు నుండి పక్క రాష్ట్రాల ప్రభుత్వాలతో మంచి సత్సంబంధాలు నేలకోలుపుతున్న తెలంగాణా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలోనూ దాన్ని కొనసాగించారు .. శిలాఫలకంపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పేర్లను లిఖించి వారికి మంచి గౌరవాన్ని అందించారు కేసీఆర్..శిలాఫలకంపై మొదటగా గవర్నర్ నరసింహన్ పేరు ఉండగా, ఆ తర్వాత ప్రాజెక్టు ప్రారంభకర్తగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పేర్కొన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్లను శిలాఫలకంపై పేర్కొన్నారు. అ తర్వాత నియోజకవర్గానికి సంబంధించిన పలువురు పేర్లు ఉన్నాయి .. 




 


Tags:    

Similar News