విజయనిర్మల ఇంట్లో వైఎస్ఆర్ ఫోటో... చూసి ఆశ్చర్యపోయిన సీఎం జగన్

Update: 2019-06-28 07:29 GMT

అనారోగ్యంతో మృతిచెందిన ప్రముఖ దర్శకురాలు, సినీనటి విజయ నిర్మలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు. పార్థీవదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం విజయనిర్మల భర్త కృష్ణను పరామర్శించిన జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన విషయం తెలిసిందే కాగా..అనంతరం సీఎం జగన్‌కు వాళ్ల ఇంట్లో ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోను చూపించారు నరేశ్. విజయనిర్మలకు వైఎస్ఆర్ అంటే ఎంతో అభిమానమని అందుకే ఆ ఫోటో ఎప్పుడూ కనిపించేలా హాల్లో పెట్టారని వైఎస్ జగన్‌కు నరేశ్ వివరించారు. ఫోటోను చూసిన జగన్ ఆశ్చర్యానికి లోనయ్యారు.

మరో వైపు అభిమానుల కన్నీటి సంద్రం నడుమ సినీ నటి విజయ నిర్మల అంతిమయాత్ర కొనసాగుతోంది. కుమారుడు నరేష్ పార్థీవ దేహం ఎదుట నడుస్తూ కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు పార్ధీవ దేహం ఉంచి వాహనం వెంట నడుస్తున్నారు. 

Similar News