హైదరాబాద్లో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసుల కొరడా.. సర్వైలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి..
హైదరాబద్ లో లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మార్చి 23 నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు 1లక్ష 34, 107 టూ వీలర్స్, 3.360 త్రీ వీలర్ వాహనాలు, 7,958 ఫోర వీలర్ వాహనాలు మొత్తం 1లక్ష 46, 258 వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వీటన్నింటిని సర్వైలెన్స్ కెమెరాల ద్వారా గుర్తించి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇక ట్రాఫిక్ పోలీసులు స్వయంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 18,268 టూవీలర్ వాహనాలు, 2,239 త్రీ వీలర్ వాహనాలు, 1,587 ఫోర్ వీలర్ వాహనాలు రోడ్లపైకి వచ్చినట్లు గుర్తించారు. మొత్తం 22,178 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 7,157 టూవీలర్ వాహనాలు, 538 త్రీ వీలర్ వాహనాలు, 309 ఫోర్ వీలర్ వాహనాలు మొత్తం 5,744 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.