మల్లన్నసాగర్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష!

Update: 2019-07-05 12:17 GMT

మల్లన్న సాగర్ భూనిర్వసితుల కేసులో కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.

 

Tags:    

Similar News