మల్లన్న సాగర్ భూనిర్వసితుల కేసులో కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ సూపరింటెండెంట్ ఇంజనీర్కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.