Telangana: తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

Telangana: హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీహెచ్‌, డీజీపీ

Update: 2022-01-04 06:54 GMT

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

Telangana: తెలంగాణలోని ప్రస్తుత కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్‌, డీజీపీ. అదేవిధంగా కోర్టులు విచారణను, విద్యాసంస్థలు చదువును ఆన్‌లైన్‌ నిర్వహించాలని పిటిషనర్‌ కోరారు.

వాదనలు, ప్రతివాదనలు విన్న న్యాయస్థానం విచారణ ఈనెల 7కి వాయిదా వేసింది. ఇక న్యూ ఇయర్‌ వేడుకల్లో నిబంధనల ఉల్లంఘనలపై 907 కేసులు నమోదు చేశామని మాస్క్‌లు పెట్టుకోని వారికి జరిమానాలు విధిస్తున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా ఈనెల 10వరకు సభలు, ర్యాలీలు, నిరసనలకు అనుమతివ్వడంలేదని చెప్పారు.

Tags:    

Similar News