ఐటీ గ్రిడ్ కేసు కీలకమలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఐటీ గ్రిడ్ ఛైర్మన్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. నిందితుడు అశోక్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశించింది. పోలీసులకు అందుబాటులో ఉండాలంటూ ఉత్తర్వలు జారీ చేసింది.