బహిరంగ ప్రదేశంలో సిగరేట్ తాగుతూ హీరో రామ్ పట్టుబడ్డాడు. చార్మినార్ వద్ద సిగరేట్ తాగిన హీరో రామ్కు పోలీసులు రూ. 200 జరిమానా విధించారు. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న చిత్రం `ఇస్మార్ట్ శంకర్`. ఈ
సినిమా చిత్రీకరణలో భాగంగా చిత్ర యూనిట్ చార్మినార్కు చేరుకుంది. చార్మినార్ పర్యాటక ప్రాంతం కావడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ధూమపానం నిషేధం. కానీ ఈ విషయం తెలియక షూటింగ్లో భాగంగా హీరో రామ్ అక్కడ సిగరెట్ను కాల్చారు. ఆ ఘటనను ఫోటో తీసిన తర్వాత బహిరంగంగా సిగరెట్ తాగినందుకు పోలీసులు రామ్కు రూ. 200 జరిమానా విధించారు. పోలీసులు రామ్కు జరిమానా విధించగా రామ్ చలానా కట్టారు.