భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

Update: 2019-10-27 08:59 GMT

దీపావళి సందర్భంగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునుంచే భక్తులు రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. భాగ్య లక్ష్మి అమ్మవారిని తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా ఆలయానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. చెడుపై మంచి సాధించిన విజయం దీపావళి అని ఆయన అన్నారు . హరీష్ రావుతో పాటు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  

Full View

Tags:    

Similar News