Harish Rao: మరివానిపల్లిలో ఓ హోటల్‌లో సామాన్యుడిలా టిఫిన్‌ చేసిన మంత్రి

* మరివానిపల్లిలో ఓ హోటల్‌లో సామాన్యుడిలా టిఫిన్‌ చేసిన మంత్రి * దోశ బాగుందంటూ కితాబు

Update: 2021-10-11 10:15 GMT

హరీష్ రావు (ఫైల్ ఫోటో)

Harish Rao: సింప్లిసిటీకి కేరాఫ్‌ అడ్రస్‌ మంత్రి హరీశ్‌రావు అని మరోసారి రుజువైంది. కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్న ఆయన, మార్గమధ్యంలో ఉన్న ఓ టిఫిన్‌ సెంటర్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు. స్పెషల్‌గా దోశ కాల్పించుకొని మరీ తిన్నారు. దోశ చాలా బాగుందంటూ హోటల్‌ యజమానికి కితాబు ఇచ్చారు. ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. దీంతో ఆ యజమానితో పాటు అక్కడున్న స్థానికులు ఆశ్చర్యపోయారు. మంత్రితో హోటల్‌ యజమాని కుటుంబ సమేతంగా ఫొటో దిగాడు

Tags:    

Similar News