హాజీపూర్ కేసు: ముగిసిన విచారణ.. ఈనెల 27న తుది తీర్పు !

Update: 2020-01-17 09:20 GMT
హాజీపూర్ కేసు: ముగిసిన విచారణ.. ఈనెల 27న తుది తీర్పు !

నల్గొండ జిల్లా హాజీపూర్‌ వరుస హత్యల కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో వాదనలు ముగిశాయి. శ్రీనివాస్‌ రెడ్డే బాలికలను హత్య చేశాడని చెప్పడానికి అన్ని ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించారు. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని.. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించి నిందితుడికి మరణ శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరారు. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి వాదనలు కూడా విన్న ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు ఈ నెల 27వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

Tags:    

Similar News