నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన.. నీటి పాలైన వరిపంట
Nizamabad: వర్షార్పణమైన ఆరబెట్టిన వడ్లు
నిజామాబాద్ జిల్లాలో వడగండ్ల వాన.. నీటి పాలైన వరిపంట
Nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వడగండ్ల వాన కురిసింది. సిరికొండ, జుక్కల్ నియోజవర్గాల్లో వడగండ్ల వానకు పంటలు నాశనమయ్యాయి. వరి చేలు నేలకు ఒరిగాయి. వడ్లు రాలిపోయాయి. పంట కోసం కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణమైంది. దీంతో ఆరుగాలం కష్టపడిన పండించి నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తమను నిండా ముంచేసిందని, ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.