మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియటంతో గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.