టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి

Update: 2019-08-03 06:24 GMT

మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయాలని సీఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎంను కలిసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గుత్తా నామినేషన్ పత్రాల దాఖలు ప్రక్రియలో సహకరించాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డికి సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News